- Advertisement -
ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న చివరి టెస్టు మూడో రోజు ఆట ఆసక్తికరంగా సాగుతోంది. మ్యాచ్ ప్రారంభమైన అరగంటలోపే భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 18.6వ ఓవర్లో ఫిలాండర్ వేసిన బంతిని ఎదుర్కొన్న రాహుల్(16) డుప్లెసిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం 21.6 వద్ద మోర్కెల్ బౌలింగ్లో పుజారా(1) డుప్లెసిస్కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
ఒకే ఒక్క పరుగు చేసిన పుజారా మోర్కెల్ బౌలింగ్ లో డుప్లెసిస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి భారత్ పీక లోతు కష్టాల్లో పడింది. పుజారా స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ 14 పురుగులు, విజయ్ 20 పరుగులతోనూ క్రీజ్లో ఉన్నారు.