చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కావేరీ జలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని, వెంటనే కావేరీ జలమండలి ఏర్పాటు చేయాలనే డిమాండ్తో తమిళనాడు రాష్ట్రం అట్టుడుకుతోంది. మరోవైపు అధికార, విపక్షాలతో పాటు పలు ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్లపై అనుమానాలు నెలకొన్నాయి. అంతేకాకుండా చెన్నైలో ఐపీఎల్ను నిషేదించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
తమిళగ వాళ్వురిమై కట్చి(టీవీకే) పార్టీ నేతలు ఏకంగా చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్లను నిలిపివేయాలని ఆ నగర పోలీస్ కమీషనర్కు వినతి పత్రం అందజేశారు. కావేరి జలమండలి ఏర్పాటు చేసే వరకు మ్యాచ్లను నిలిపివేయాలని కోరామని, ఒక వేళ మ్యాచ్లు నిర్వహిస్తే అడ్డుకొని తమ నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. దీంతో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్లు జరగడంపై అనుమానాలు తలెత్తాయి.