ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్ట్ సిరీస్లో భాగంగా ఇప్పటికే 2-1 తేడాతో లీడ్లో ఉంది టీమిండియా. ఇక నాలుగో టెస్ట్ ఈ నెల 23 నుండి రాంచీ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే గాయాల కారణంగా సీనియర్ ఆటగాళ్లు దూరం కాగా తాజాగా టీమిండియాకు మరో షాక్ తగిలింది.
టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ యశస్వీ జైస్వాల్ నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండేది కష్టంగానే కనిపిస్తోంది.. ఎందుకంటే తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు జైస్వాల్. దీంతో గాయం మరింత తీవ్రం కాకుండా జైస్వాల్కు రెస్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సెలక్టర్లు. ఇక గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్ నాలుగో టెస్టులో జైస్వాల్ ప్లేస్ని రిప్లేస్ చేసే అవకాశం ఉంది.
మిడిలార్డర్ లో సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జొరెల్ ఉండగా వీరిద్దరిలో ధృవ్ పై వేటు పడే అవకాశం ఉంది. ఇక నాలుగో టెస్ట్ రెండు జట్లకు కీలకమే. ఎందుకంటే ఇంగ్లాండ్ ఈ టెస్టులో గెలిస్తే సిరీస్ సమం కానుండగా టీమిండియా గెలిస్తే సిరీస్ మన సొంతం అవుతుంది. అందుకే నాలుగో టెస్టుపై విజయం ఎవరిదా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.