సినిమా.. సినిమా.. సినిమా ఇదే కొంత మంది ప్రపంచం… ఇది కేవలం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే కాదే వేల మంది జీవనోపాధికి మూలం. సినీ రంగాన్ని నమ్ముకొని ఎంతో మంది కార్మికులు జీవిస్తున్నారు. సెలబ్రెటీలు మాత్రమే కాదే.. లైట్ మెన్ నుంచి థియేటర్లలో పనిచేసేవారి వరకు సినీ లోకాన్ని నమ్ముకున్నవారే.. అలాంటిది కరోనా మహమ్మారి వారి జీవితాలను చీకటి మయం చేసింది. మార్చి నెల నుంచి లాక్ డౌన్ మొదలైంది.. ఈ మద్య పూర్తి స్థాయిలో సడలించారు. కరోనా కారణంగా షూటింగ్, థియేటర్లు, మాల్స్ అన్ని మూసివేశారు. దాంతో సినీ రంగం స్తంభించిపోవడంతో, ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.
షూటింగ్ లు నిలిచిపోయాయి, స్టూడియోలు మూతపడ్డాయి. థియేటర్లలో బొమ్మ పడలేదు. ప్రస్తుతం అన్ లాక్ ప్రక్రియ మొదలు కావడంతో తిరిగి షూటింగ్ లు మొదలు అయ్యాయి. త్వరలో థియేటర్లు ఓపెన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ వీడియో ట్వీట్ చేశారు. ఆ ట్విట్ చూస్తుంటే నిజంగా హృదయం కదిలిపోతుంది. తాళం వేసి ఉన్న ఓ థియేటర్ ను మళ్లీ తెరుస్తున్న సీన్లు ఆ వీడియోలో చూడొచ్చు.
ఈ వీడియో చూసిన తర్వాత కళ్లలో నీళ్లు తిరిగాయని పూరి జగన్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. “మళ్లీ ఆ రోజులు రావాలి, విజిల్స్ వేయాలి, పేపర్లు ఎగరాలి, చొక్కాలు చిరగాలి అని ఆకాంక్షించారు. సినిమా థియేటర్ మన అమ్మ” అంటూ ఉద్వేగభరితంగా స్పందించారు. థియేటర్లో బొమ్మ చూడాలని ప్రేక్షకులు సైతం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్స్..!
డబ్బులు లేకుంటే ఆ యాంకర్ నా పెళ్లి చేసింది : పూరి జగన్నాథ్