Sunday, May 5, 2024
- Advertisement -

దారుణం… కశ్మీర్​లో గ్రెనేడ్​ దాడి..!

- Advertisement -

ఉత్తర కశ్మీర్​లోని బారముల్లా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రత బలగాలే లక్ష్యంగా గ్రెనేడ్​ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని పత్తన్​ సింగ్​పొరా మార్కెట్​ ప్రాంతంలో ఉదయం 10 గంటల సమయంలో గ్రెనేడ్​ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు.

క్షతగాత్రులను పత్తాన్​లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు అధికారులు. దాడికి పాల్పడిన ముష్కర మూకలను పట్టుకునేందుకు ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నట్లు వెల్లడించారు.

సింగ్​పొరా ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనేడ్​ దాడి చేశారు. అయితే.. వారు అనుకున్న లక్ష్యంలో కాకుండా రోడ్డుపై పడి పేలిపోయింది. ఇందులో ఐదు నుంచి ఆరుగురు స్థానికులు గాయపడినట్లు తెలిసింది అని అధికారులు తెలిపారు.

Also Read

మా టీకా సురక్షితం..!

మళ్లీ ముఫ్తీ గృహనిర్బంధం..!

బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. అలాంటి నేతలే ప్రధాన టార్గెట్

నిహారిక పెళ్లికి స్పెషల్ ఫ్లయిట్ లో అల్లు ఫ్యామిలీ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -