మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ‘ఉప్పెన’శుక్రవారం విడుదలపై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమాకి క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. ఆయనకు కూడా ఇది తొలి సినిమా కావడం విశేషం. దాదాపు 99 శాతం కొత్తవాళ్లతో వచ్చిన ఉప్పెన.. బాక్సాఫీస్ పై విరుచుకుపడుతోంది. తొలి రోజే రూ. 10.42 కోట్లు రాబట్టింది.
ఇక వైష్ణవ్ తొలి సినిమా హిట్ అవడంతో మెగా హీరోలతో పాటు.. ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. శుక్రవారం థియేటర్ కి వెళ్లి సినిమా చూసిన మెగా బ్రదర్ నాగబాబు.. తన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఉప్పెన పై నాగబాబు ఏమన్నారో ఆయన మాటల్లో..
మా ఫ్యామిలీలో వైష్ణవ్ అందరి కంటే చాలా చిన్నవాడు. వాడు హీరోగా చేసిన తొలి సినిమా ప్రివ్యూ చూద్దామనుకున్నా.. కానీ నిహారిక కోరిక మేరకు థియేటర్ కి వెళ్లి చూశా. ఉప్పెన చూసిన తరువాత చాలా డిఫరెంట్ ఫిల్మ్ అనిపించింది. తొలి సినిమాతోనే పెద్ద రిస్క్ చేశాడు వైష్ణవ్. ఒక నటుడిగా ఇంతకంటే పెద్ద రిస్క్ మళ్లీ చేయలేడు. అలాగే ప్రొడ్యుసర్ గట్స్కి నేను షాక్ అయ్యా. ఇంత రిస్క్ కంటెంట్ని స్క్రీన్ మీదికి తీసుకురావాలనే వాళ్ల ఆలోచన చాలా ధైర్యంతో కూడుకున్నది.
ఒకవేళ నేనే నిర్మాత అయ్యి ఉంటే మాత్రం ఈ సినిమాని చేసి ఉండేవాడిని కాదు. ఈ రిస్క్ కంటెంట్ని టచ్ చేసేవాడినే కాదు. డూ ఆర్ డై కంటెంట్. కోట్లతో కూడిన వ్యవహారం ఇది.. ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ల టేస్ట్ నాకు బాగా నచ్చింది.అలాగే కెరియర్లో వైష్ణవ్కి తొలి సినిమా ఇది.. ఒకవేళ ఈ సినిమా కంటెంట్ వైష్ణవ్ కనుక నాకు చెప్పిఉంటే.. నూటికి నూరు శాతం చేయొద్దని చెప్పేవాడిని. ఎంత పెద్ద కథ అయినా చేయొచ్చు కానీ.. ఇలాంటి కథ చేయాల్సిన అవసరం లేదు వైష్ణవ్ అని చెప్పేసి ఉండేవాడిని’అని నాగబాబు చెప్పు కొచ్చారు.
విభిన్న కథాంశంతో రాబోతున్న శ్రియ!
పెళ్లి పీటలు ఎక్కబోతున్న మహానటి !