తెలంగాణ.. నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని శుక్రవారం టిడిపి జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. చంద్రబాబు కోడలు బ్రహ్మిని, సినీ నటుడు బాలకృష్ణ సతీమణి వసుంధర… సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రస్తుతం ఏపిలో ఎన్నికల హడావుడి జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన పర్సనల్ టూర్ పై ఆసక్తి నెలకొంది. చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్కు సరస్వతి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం జరిపించారు.
బాలకృష్ణ మరో మనవడు ఆర్యన్కూ అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో పూజలు చేపట్టారు. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండడంతో చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు అక్షరాభ్యాసం కార్యక్రమానికి రాలేకపోయారు.
అయ్యయ్యో.. పవన్ సినిమాకు కూడా లీకుల దెబ్బ !