దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి మరణ మృదంగం మొగిస్తుది. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు వరుసగా కన్నుమూస్తున్నారు. తెలుగు పరిశ్రమలోనే కాకుండా.. హిందీ, తమిళం, కన్నడ, మళయాలం ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు వివిధ అనారోగ్య కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ ఎంతో మంచి పేరు వచ్చింది.
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కీర్తి రెడ్డి తండ్రి తండ్రి కేశ్ పల్లి (గడ్డం) ఆనంద రెడ్డి గుండెనొప్పితో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిట్లో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రముఖ డైరెక్టర్ ఎస్వీ కృష్ణరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన గన్ షాట్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది.
తెలుగుతోపాటు పలు తమిళ, హిందీ సినిమాల్లో కూడా కీర్తీ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘అర్జున్’ చిత్రంలో ఆయన సోదరిగా నటించింది కీర్తిరెడ్డి. 2004లో హీరో సుమంత్ ను పెళ్లి చేసుకొని 2006లో విడాకులు తీసుకుంది. బిజినెస్ మెన్ ను వివాహం చేసుకొని బెంగళూరులో ఉంటుంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా… త్వరలోనే ప్రకటన?