- Advertisement -
తాజమహల్ మళ్లీ హెడ్ లైన్స్ లో నిలిచింది. ఈ చారిత్రక కట్టడంపై ఎన్నో వాదనలు, వివాదాలు గతంలో తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తాజమహల్ స్థల వివాదం తెరపైకి వచ్చింది. తాజ్ మహల్ నిర్మించిన స్థలం తమదేనంటూ జైపూర్ మాజీ యువరాణి, బీజేపీ ఎంపీ దియా కుమార్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
తమ పూర్వీకుల నుంచి ఈ స్థలాన్ని షాజహాన్ లాక్కున్నారని ఆమె ఆరోపించారు. ఈ స్థలం తమదే అనడానికి తగిన ఆరాధాలు ఇప్పటికీ ఉన్నాయంటూ దియా వ్యాఖ్యానించారు. నిజాలు తెలియాంటే తాజ్ మహల్ లోని 22 రహస్య గదులు తెరిపించాలని డిమాండ్ చేశారు.
ఆ రహస్య గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయన్నారు. దియా వ్యాఖ్యలకు ఎక్కడికి దారి తీస్తాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.