బిగ్బాస్ రెండో సీజన్ చివరికి చేరుకుంది.మరో నాలుగు రోజుల్లో బిగ్బాస్ విన్నర్ ఎవరో తెలిపోనుంది.16 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్బాస్లో చివరికి ఐదుగురు సభ్యులు మాత్రమే మిగిలారు.బిగ్బాస్ మొదటి సీజన్తో పోలిస్తే రెండో సీజన్లో వివాదాలు ఎక్కువ.గీతా మాధురి,కౌశల్,తనీష్,దీప్తి,సామ్రాట్లు బిగ్బాస్ ఫైనల్స్కు చేరిన సంగతి తెలిసిందే.బిగ్బాస్ రెండో సీజన్ మొత్తం మీద ఈ వారం ఎటువంటి గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా సాగుతుందని చెప్పాలి.తాజాగా ఈ రోజు ప్రోమోని విడుదల చేశారు బిగ్బాస్.ఈ ప్రోమోలో బిగ్బాస్ ఇంటి సభ్యులను ఒక్కొక్కరిని లివింగ్ రూమ్లోకి పిలిచి వారి మనస్థత్వాలపై మాట్లాడారు.
మొదట తనీష్ని పిలిచిన బిగ్బాస్ చాలా ఆంగ్రీ యంగ్ మ్యాన్గా బిగ్బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన మీరు చాలా మారారు అనుకుంటున్నాం అంటు తనీష్ని ఉద్దేశించి మాట్లాడాడు బిగ్బాస్ తరువాత సామ్రాట్ను ఉద్దేశించి మాట్లాడుతు..మీరు అత్యాంత సున్నితమైన వ్యక్తిగా వచ్చిన మీరు తోటి హౌస్మెట్స్తో అందరితోను తొందరగా కలిసిపోయారని చెప్పడం జరిగింది.అందరు మీకు దగ్గర అయ్యేలోపు మీరు బిగ్బాస్ ఇంట్లో రిలేషన్షిప్ పెట్టుకున్నారని తెలిపాడు బిగ్బాస్ .దీప్తిని ఉద్దేశించి మీరు చాలా సాఫ్ట్ మనిషిగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి,అందరి చేత అమ్మాలా ఇంటిని చూసుకోవడం బిగ్బాస్ గమనిస్తునే ఉందని తెలిపాడు.మీలా స్నేహనికి కట్టుబడి ఉండటం ఎవరి వల్ల కాదు అనడంతో దీప్తి కళ్లలో నుంచి నీరు రావడం మనం ఈ ప్రోమోలో చూడవచ్చు.ఈ ప్రోమోలో గీతా మాధురి,కౌశల్ గురించి చూపించలేదు.