యంగ్ టైగర్ ఎన్టీఆర్,మాటల మాంత్రికుడు కాంబినేషన్లో వస్తున్న సినిమా అరవింద సమేత.దసరాకు కానుకగా విడుదల అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ పెంచేసింది చిత్ర యూనిట్. దర్శకుడు త్రివిక్రమ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతు సినిమాకు సంభంధించిన విశేషాలు గురించి చెప్పుకొచ్చారు. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తో కలిసి పని చేయడానికి చాలా ఇబ్బంది పడ్డానని చెప్పాడు త్రివిక్రమ్. షూటింగ్ ఉదయం 7 గంటలకి పెట్టుకుంటే తారక్ ఆరున్నరకే సెట్ లో ఉండేవాడట.
దీంతో తారక్ కోసం యూనిట్ మొత్తం అరగంట ముందే రావాల్సి వచ్చేదని అదొక టార్చర్ అని చమత్కరించాడు త్రివిక్రమ్. ఉదయాన్నే షూటింగ్ కోసం వచ్చే తారక్ అర్ధరాత్రి వరకు అంతే ఎనర్జీతో ఎలా ఉండేవాడో ఇప్పటికీ అర్ధం కాదని త్రివిక్రమ్ అన్నారు. అతడి ఎనర్జీని ఆపే యాంటిబయాటిక్ లేదనిపిస్తుందని అదొక వైరస్ అని అభిప్రాయ పడ్డారు. తారక్ కారణంగా వంద రోజుల పాటు చేయాల్సిన షూటింగ్ డెబ్బై రోజుల్లోనే పూర్తయిందని అన్నారు. పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది.