తమ అభిమాన హీరో పుట్టినరోజును పండగలా చేసుకుంటుంటారు ఫ్యాన్స్. ఇక చిత్ర నిర్మాతలు పుట్టినరోజును తమ సినిమా ప్రమోషన్కు వాడుకోవడం కూడా మామూలు. ప్రతి స్టార్ హీరో పుట్టినరోజు సందర్భంగా ఆయన లెటెస్ట్ మూవీకి సంబంధించిన పోస్టర్, లేదా గ్లిమ్స్ వీడియో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేశ్బాబు బర్త్డే. మహేశ్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నాడు.
బ్యాంకులను అడ్డుపెట్టుకొని జరుగుతున్న దోపిడీ ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నటి కీర్తి సురేశ్ హీరోయిన్గా చేస్తోంది. ఇదిలా ఉంటే ఆగస్ట్ 9న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తారని ఫ్యాన్స్ భావించారు. అయితే పోస్టర్తో పాటు గ్లిమ్స్ వీడియో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
ఈ సినిమా తర్వాత మహేశ్బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ త్రివిక్రమ్ చాలా రోజుల కిందటే స్క్రిప్ట్ వర్కు పూర్తి చేశాడు. దీంతో ఈమూవీకి సంబంధించిన అప్ డేట్ కూడా మహేష్ బర్త్ డే సందర్భంగా వచ్చే చాన్స్ ఉంది. త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత మహేశ్ మూవీకి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే చాన్స్ ఉంది.
Also Read
సినీ మేకర్స్ కి ఈ లీకుల బాధ తప్పదా..! బ్రేక్ పడేదేలా..!
చైతూకు నో చెప్పిన బేబమ్మ..! రీజన్ ఏమిటో?
ఈ భామ జోరు చూస్తే ..పూజా హెగ్డే, రష్మికకు ఎసరు పెట్టేలా ఉందే..!