యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం అరవింద సమేత.దసరాకు కానుకగా ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను చినబాబు నిర్మించారు.ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ఎన్టీఆర్ అరవింద సమేతపై కొందరు కావలనే కుట్ర పన్నతున్నారని సమాచారం.అరవింద సమేతకు థియోటర్లు ఎక్కువ రాకుండా ఓ సామాజిక వర్గం అడ్డుపడిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇది ఎన్టీఆర్కు కొత్తకాదు. ఎన్టీఆర్ గత సినిమాలపై కూడా ఇలాగే కుట్ర చేశారని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎవరు ఎన్ని చేసిన అరవింద సమేతని ఆపలేరని ఎన్టీఆర్ అభిమానులు స్పష్టం చేశారు.మరి ఎన్టీఆర్పై ఎవరు అంత కక్ష్య కట్టి ఇలా చేశారో తెలియాల్సి ఉంది.ఇక అరవింద సమేత విషయానికి వస్తే సినిమా టీజర్ ,ట్రైలర్ ఆకట్టుకున్నాయి.ఇప్పటికే విడుదల అయిన పాటలకు మంచి రెస్పన్స్ వచ్చింది.సినిమాలో హీరోయిన్స్గా పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు నటించారు.విలన్గా జగపతి బాబు నటించారు.