- Advertisement -
హీరోయిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మోహిని’.మాదేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్.తెలుగులో కూడా ‘మోహిని’ పేరుతోనే విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ఉత్కంఠ రేపుతోంది. ‘ఎన్నో వేల సంవత్సరాలుగా పూడ్చి పెట్టబడిన నిజం’ అంటూ ఈ ట్రైలర్ ప్రారంభమైంది.
సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా అది ఉంటుందని, ముఖ్యంగా మహిళలకు ఈ చిత్రం ఎంతగానో నచ్చుతుందని దర్శకుడు మాదేష్ అన్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 27న తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. త్రిష ఈ సినిమాతో పాటు విజయ్సేతుపతితో కలిసి 96 అనే సినిమా కూడా చేస్తున్నారు.ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే.