Tuesday, April 30, 2024
- Advertisement -

క్రేజీ..షర్మిలకు లోకేష్ గిఫ్ట్!

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. క్రిస్మస్ పర్వదినాన వైఎస్ షర్మిలకు స్పెషల్ గిఫ్ట్ పంపించారు టీడీపీ నేత నారా లోకేష్. మీకు, మీ కుటుంబసభ్యులకు నారా కుటుంబం క్రిస్మస్‌, న్యూఇయర్‌ శుభాకాంక్షలు తెలియజేస్తోంది అంటూ ట్వీట్ చేశారు లోకేశ్. ఇక తనకు క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు విషెస్ చెప్పినందుకు షర్మిల సైతం స్పందించారు. క్రిస్మస్ గిప్ట్స్ అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు షర్మిల. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీ వర్సెస్ నారా ఫ్యామిలీగా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు కుటుంబాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించడం సర్వ సాధారణం. పలు సందర్బాల్లో అయితే టీడీపీ నేతలు వైఎస్ కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సందర్భాలున్నాయి. కానీ ఎప్పుడు వైఎస్ఆర్ కానీ జగన్ కానీ చంద్రబాబు కుటుంబసభ్యులను వ్యక్తిగతంగా విమర్శించింది లేదు.

ఇక త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనూహ్యంగా లోకేష్..వైఎస్ ఫ్యామిలీకి చెందిన షర్మిలకు క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం , దానికి ఆమె ధన్యవాదాలు తెలపడం చర్చనీయాశంగా మారింది. ఇక త్వరలోనే ఏపీలో కాంగ్రెస్ తరపున షర్మిల ప్రచారం చేయనున్నారని టాక్ నడుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -