Wednesday, May 8, 2024
- Advertisement -

అతని ఆశలపైన నీళ్ళు చల్లిన ఎన్టీఆర్

- Advertisement -

చాలా రోజులుగా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఓ చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మిస్తారు అని కూడా అనుకున్నారు. ఎన్టీఆర్‍కు తగ్గట్లు వంశీ ఓ పవర్ ఫుల్ కథ కూడా సిద్ధం చేసాడట. ఆ కథ కూడా ఎన్టీఆర్‍కు వినిపించడట, కథ విన్న ఎన్టీఆర్ చాలా బాగుందని చేప్పాడట.

ఐతే ఎన్టీఆర్ ఈ సినిమా విషయంలో వెనకడుగు వేశాడట. ఈ విషయం తెలుసుకున్న వంశీ చాలా బాధ పడ్డాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటల శివ దర్శకత్వంలో జనత గ్యారేజ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, వక్కంత వంశి కాంబినేషన్‍లో సినిమా ఉంటుందనుకున్నారు.

కానీ ఎన్టీఆర్ కొరటల శివ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడట. సో అలా మరోసారి వంశీ ఆశల మీద ఎన్టీఆర్ నీళ్ళు చల్లాడు. మరి వక్కంతం వంశీకి ఎన్టీఆర్ అవకాశం ఇస్తాడో లేక అసలు ఇవ్వడో తెలియాలంటే ఇంకోన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -