Sunday, May 26, 2024
- Advertisement -

ఓడిపోతే మంత్రి ప‌ద‌వి గోవిందేనా…..?

- Advertisement -
Akhila Priya political future depends on Nandyal By Poll..?

తండ్రి మ‌ర‌ణంలో అతి చిన్న వయ‌సులోనే మంత్రి ప‌ద‌విని అధిస్టించి రాష్ట్ర రాజ‌కీయాల‌ల్లో సంచ‌ల‌నం సృష్టించారు.మొద‌టి ఉన్న సానుభూతి రానారాను ఎవ‌రినీ లెక్చేయ‌కుండా ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు కార‌నంగా పోగొట్టు కుంటున్నారు.అఖిల రాజ‌కీయ భ‌విష్య‌త్తే అనిశ్చితిలో ప‌డిపోయే ప్ర‌మాదం పొంచి ఉంది.

భూమానాగిరెడ్డి మ‌ర‌ణంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్య‌మ‌య్యింది.ఈ ఎన్నిక‌ను ఇరు పార్టీలు చావో రేవో అన్న‌ట్లుగా త‌ల‌ప‌డుతున్నాయి.ఎన్నిక‌లో విజ‌యం సాధించాల‌ని వైసీపీ….టీడీపీ గెలిచి ఉనికిని కాపాడుకోవ‌డాన‌కి శ‌త‌విధాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.అఖిల ప్రియ ఎవ‌రినీ లెక్క చేకుండా ఉండం,ఏక‌ప‌క్ష‌ధోర‌నితో వెల్తుండ‌టంతో నంద్యాల‌లో గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు.చిన్న వయస్సులోనే మంత్రి బాధ్యతలు తీసుకున్న అఖిలప్రియకు ఒక్కసారిగా పెద్ద బాధ్యతే వచ్చి పడింది. దాంతో ఏం చేయాలో మంత్రికి తోచటం లేదు.

{loadmodule mod_custom,GA1}

అఖిలను మంత్రివర్గంలోకి తీసుకుని తప్పు చేసానా? అని చంద్రబాబునాయుడు కూడా అనుకుంటున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి.రాజ‌కీయ అనుభ‌వంలేక‌పోవ‌డంతో రాజకీయాల‌ను బ్యాలెన్స్ చేయ‌లేక‌పోతోంది. భూమా నాగిరెడ్డి మరణంతో సానుభూతి వల్ల ఉప ఎన్నికల్లో టిడిపి గట్టెక్కుతుందని మొదట్లో చంద్రబాబు అనుకున్నారు. అందుకనే అఖిలను మంత్రిని చేసారు. అయితే, వాస్తవ పరిస్ధితి అందుకు భిన్నంగా ఉంది. పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్ళలేకపోవటం, సీనియర్లతో ఎలా మెలగాలో కూడా మంత్రికి అర్ధం కావటం లేదు.
అఖిలకు సమస్య ఎక్కడ వచ్చిందంటే తన తండ్రి భూమా నాగిరెడ్డికి పార్టీలోని ఏ గ్రూపుతోనూ పడదు. అందరితోనూ తీవ్రస్ధాయిలో శతృత్వముంది. శిల్పా మోహన్ రెడ్డి టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరటం ఇందులో భాగమే. దానికితోడు జనరేషన్ గ్యాప్ అంటూ తన తండ్రికి బాగా సన్నిహితులైన ఏసి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళను కూడా మంత్రి దూరంగా పెడుతున్నారు. అందుకని భూమాకు బాగా దగ్గరైన వాళ్లు కూడా అఖిలకు దూరమైపోతున్నారు.

{loadmodule mod_custom,GA2}

మంత్రి వైఖరితో రేపటి ఉప ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని చంద్రబాబు ఆందోళనలో మొదలైంది. అంటే చంద్రబాబు వేసిన అంచనాకు పూర్తి రివర్స్ లో జరుగుతోంది. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నంద్యాలలోని బలమైన గంగుల కుంటుంతో పాటు శిల్పా మోహన్ రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకున్నారు. దాంతో చంద్రబాబులో ఆందోళన మరింత పెరిగిపోతోంది. అందుకే శనివారం జిల్లా నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవాల్సిన అవసరాన్ని స్పష్టంగా చెప్పారు. ఒకవేళ టిడిపి ఓడిపోతే అఖిలప్రియ ఉద్యోగానికే ఎసరు వచ్చినా ఆశ్చర్య పోవక్కర్లేదు.అఖిల భ‌విష్య‌త్తు ఈ ఉప ఎన్నిక‌మీదె ఆదార‌ప‌డించ‌ద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}eNfv4VkqTcc{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -