బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబచ్చన్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. గత ఏడాది కరోనా కారణంగా లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వలస కార్మికులకు అండగా నిలిచారు. వారిని సొంత రాష్ట్రాలకు తరలించడానికి తన వంతుగా సాయం చేశారు. ఏకంగా వారి కోసం రెండు ప్రత్యేక విమానాలను బుక్ చేసి తమ ఇళ్లకు చేర్చారు. దాదాపు 700 మంది కార్మికులు ముంబై నుంచి యూపీ, గుజరాత్ ప్రాంతాలకు వెళ్లారు.
సినీ కార్మికుల కోసం సైతం బిగ్ బీ ఎంతో సహాయం అందించారు. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, అంబులెన్స్లను అందుబాటులో ఉంచనున్నట్టు ఆయన తెలిపారు. 300 పడకలతో ఏర్పాటైన ఈ కేంద్రంలో పేషెంట్లకు ఉచిత సేవలందిస్తామని ఆయన తెలిపారు.
ఈ కేంద్రం ఏర్పాటులో జరుగుతున్న పనుల గురించి అమితాబ్ ఎప్పటికపుడు తెలుసుకుంటున్నారని ఆయన అన్నారు. తమకు విరాళం ఇచ్చే సందర్భంగా సిఖ్కులు ఈ దేశానికి చేసిన సేవలకు తాను నమస్కరిస్తున్నానని అమితాబ్ అన్నారని ఆయన తెలిపారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కన్నుమూత!