- Advertisement -
సామాన్యులకు వాత పెడుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసనగా దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ఈ భారత్ బంద్కు 21 పార్టీలు మద్దతు తెలిపాయి. తృణమూల్ కాంగ్రెస్ మినహా మిగతా అన్ని విపక్ష పార్టీలు ఈ బంద్ను చేపడుతున్నాయి.
ఏపీ ప్రభుత్వం వాహనదారులకు ఉరట కలిగించే నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు.
ప్రస్తుతం పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1,120 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని చంద్రబాబు తెలిపారు. అయినా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.