Monday, April 29, 2024
- Advertisement -

క‌మ‌ల్ హాస‌న్‌పై క్రిమిన‌ల్ కేసు న‌మోదు..

- Advertisement -

ఓట్ల కోసం కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి పార్టీల నాయ‌కులు ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఎన్నిక‌ల నియ‌మావ‌లిని ఉల్లంఘించి చేస్తున్న వ్యాఖ్య‌ల వ‌ల్ల ఇబ్బందుల్లో ప‌డుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ఇబ్బందుల్లో పడ్డారు. 12 ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మైనారిటీలు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతంలో మాట్లాడుతూ .. దేశంలో తొలి ఉగ్రవాది హిందువేనని వ్యాఖ్యానించారు.మహాత్మా గాంధీని చంపిని నాథూరాం గాడ్సేనే స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది అని ఆరోపించారు. ఈ ఆరోప‌న‌ల‌పై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది.

క‌మ‌ల్ వ్యాఖ్య‌ల‌పై భాజాపా నేత‌లు మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న‌పై క్రిమిన‌ల్ కేసు న‌మోదు అయ్యింది. కమల్ హాసన్ హిందూ మతాన్ని ఉగ్రవాదానికి ముడిపెట్టడం ద్వారా తమ మనోభావాలను దెబ్బతీశారని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై పటియాలా కోర్టు రేపు విచారణ జరిపే అవకాశముందని కోర్టు వర్గాలు తెలిపాయి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -