ప్రపంచంలో అంతరిక్ష రంగంలో ఇస్రో కు ఘనమైన చరిత్ర ఉంది.అగ్రదేశాలైన అమెరికా,రష్యా,చైనా సరసన భారత్ నిలిచింది.ఈ మధ్యనే అంతరిక్షంలోకి ఒకే సారి 104 ఉపగ్రహాలు పంపి చరిత్ర సృష్టించింది.
ఇప్పుడు మరో ప్రయేగానికి సిద్దమవుతోంది ఇస్రో.అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే భారతీయులను అంతరిక్షంలోకి వెల్ల నున్నారు.
ఇప్పటి వరకు అమెరికా,రష్యాలు సొంతంగా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపగలిగారు.కాని ఇస్రో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి రికార్డులు సృష్టిస్తోంది.ఇప్పుడు మరో ప్రయేగానికి సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన రాకెట్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిద్ధం చేస్తోంది. దాని పేరు జీఎస్ఎల్వీ ఎంకే-III. ఇప్పటి వరకు భారత్ తయారుచేసిన వాటిలో అతిపెద్ద రాకెట్ ఇదే కానుంది.
{loadmodule mod_custom,Side Ad 2}
ఇస్రో తయారు చేస్తున్న రాకెట్లల్లో ఇదే అతి పెద్దది. ఎస్ఎల్వీ ఎంకే-III దాదాపు 200 ఏనుగులంత పరిణామంలో ఉంటుంది. ప్రస్తుతం శ్రీహరికోటలో ఉన్న ఈ రాకెట్ను జూన్ మొదటి వారంలో పరీక్షించనున్నట్టు సమాచారం. తొలి పరీక్షలోనే ఇది విజయవంతమవుతుందని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటిరకు ఇప్పటివరకు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే ప్రయేగాలు చేపట్టిన ఇస్రో సరికొత్త ప్రయోగానికి సిద్దంగా ఉది.దీని ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లడమేనని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్ వద్ద పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ), జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్-II (జీఎస్ఎల్వీ ఎం-II) లు ఉన్నాయి.
{loadmodule mod_sp_social,Follow Us}