ఉత్తర ప్రదేశ్ సీఎం యేగ ఆధిత్యానాద్ సంలనాలకు మారుపేరు. ఎవరైనా అధికరంలోకి వచ్చితర్వాత రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి తగిన సమయం తీసుకుంటారు.కానీ యేగీ మాత్రం అలాకాదు. సీఎం అయిన వెంటనే ఏ సీఎంలు తీసుకోని నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు.నరేంద్ర మోదీలాగా పాలనలో సంస్కరణలకు పెద్దపీట వేస్తూ సంచల నిర్ణయాలు తీసుకుంటున్నారు.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో నూతన సంస్కరణల్ని ప్రవేశపెడుతూ పాలనలో తనదైన ముద్రవేస్తూ ముందుకు సాగుతున్నారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని భాజపా సొంతం చేసుకున్న తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పట్నుంచి సంచలనాత్మక నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా ప్రతీ సంవత్సరం మార్చ్ 31లోగా మంత్రులందరూ తమ ఆస్తులను ప్రకటించాల్సిందేనని ఆదేశాలు జారీచేశారు.
గతంలో ఉద్యోగస్తులందరూ తమ ఆస్తులను వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నారు.మార్చి నెలలో అధికార పగ్గాలు చేపట్టిన ఆదిత్యనాథ్ మంత్రులు, అధికారులు ఖర్చులు తగ్గించుకోవాలని సూచిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించేవాల్లంతా వ్యాపారస్తులకు,వ్యాపారానికి దూరంగా ఉండాలనీ సూచించారు. మంత్రులు ఎవరూ రూ.5వేల కంటే ఖరీదైన బహుమతులను తిరస్కరించాలన్నారు.విలాసవంతమైన జీవితానికి,పార్టీలు,డిన్నర్లకు మంత్రులందరూ దూరంగా ఉండాలన్నారు.వ్యక్తిగత, అధికారిక పర్యటనలు ఏమైనప్పటికీ మంత్రులు ప్రభుత్వ అతిథిగృహాల్లోనే బసచేయాలన్నారు. ఒకవేళ ఎవరైనా తమ బసకు ఏర్పాటుచేసేందుకు ముందుకువచ్చినా తిరస్కరించాలని సూచించారు. ప్రజాపరిపాలనకు పెద్ద పీట వేస్తున్న యేగీ భవిష్యత్తులో ఎన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
Also Read