రెండు రోజుల పాటు జరగనున్న 15వ జీ-20 సదస్సు శనివారం ప్రారంభంకానుంది. సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రియలైజింగ్ ది ఆపర్చ్యూనిటీస్ ఆఫ్ 21స్ట్ సెంచ్యూరీ ఫర్ ఆల్” అనేది ఈసారి థీమ్గా ఎంచుకున్నట్టు భారత విదేశాంగశాఖ వెల్లడించింది.
ఈ ఏడాది ఇప్పటికే ఓసారి జీ-20 సదస్సును నిర్వహించారు. మార్చి నెలలో జరిగిన ఆ భేటీలో.. కరోనా వ్యాప్తిపై నేతలు చర్చించారు.సౌదీ రాజు ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జీ-20 సదస్సులో పాల్గొంటారు. కొవిడ్-19 రికవరీ సమయంలో ప్రదర్శించాల్సిన ఐకమత్యం, ధైర్యంపై ఈ సదస్సులో నేతలు దృష్టి పెడతారు. ఉద్యోగ కల్పనకు సంబంధించి తమ ప్రణాళికలను నేతలు చర్చిస్తారు. స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంపై వీరు సమాలోచనలు చేస్తారు.
కరోనా వచ్చింది… ఉరిశిక్ష తప్పింది..!
ఆ గ్రామంలో అందరికీ కరోనా.. కానీ..