Saturday, May 4, 2024
- Advertisement -

ఒక్క రూపాయకే క్వార్టర్ మందు.. ఎక్కడో తెలుసా?

- Advertisement -

దేవతల కాలం నుంచి నేటి వరకు సురాపానం అంటే ఇష్టపడని వారు ఉండరు. మందు అంటే పిచ్చెక్కిపోయేవారిని చూశాం. లాక్ డౌన్ సమయంలో మందు కోసం ఉన్మాదులుగా మారారు.. ఎర్రగడ్డ ఆసుపత్రికి క్యూ కట్టారు.. శానిటైజర్ తాగి కొంత మంది చనిపోయారు. ఇక లాక్ డౌన్ సడలించిన తర్వాత మద్య దుకాణాలు తెర్చుకోవడంతో మందుబాబులు ఊపిరి పీల్చుకున్నారు.

వాస్తవానికి మద్యం అమ్మకాలతో రాష్ట్రాలకు మంచి ఆదాయం వస్తుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో మద్యం వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. వనపర్తి జిల్లా చందాపూర్ లోని ఓ వైన్ షాపులో ఆదివారం గంటపాటు రూపాయికే క్వార్టర్ లిక్కర్ అమ్మారు. దీనికి ఓ కారణం ఉంది.. సదరు షాపు ఓనరు చింతకుంట విష్ణు ‘జయం మనదే’ డైరెక్టర్ ఎన్.శంకర్ కి వీరాభిమాని.

సోమవారం శంకర్ పెళ్లిరోజు సందర్భంగా ఆదివారం చందాపూర్ లో మందుబాబులకు రూపాయికే క్వార్టర్ ఇప్పించారు. వైన్ షాప్ ఎదురుగా బ్యానర్ పెట్టి ఉదయం 11 నుంచి 12 గంటల వరకు వంద మందికి పైగా ప్రజలకు ఇలా మందు అందించారు.. ఆ తర్వాత జోగులాంబ అమ్మవారి సన్నిధిలో అన్నదానం చేశారు.

మళ్ళి ప్రేమ వివాహనికి రెడీ అవ్వుతున్నా ప్రభుదేవా..?

హీరోయిన్ రాసి భర్త ఎవరో తెలుసా ?

నటి సీత ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా ?

జై చిరంజీవ నటించిన ఈ పాప ఇప్పుడెలా ఉందో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -