పార్లమెంట్ సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. గత వారం రోజులుగా లోక్ సభ, రాజ్య సభలో ధాన్యం కొనుళ్లుపై కేంద్రంపై పోరాటం చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టంగా చెప్పడంలేదని మండిపడ్డారు. లోక్సభ నుంచి 9 మంది, రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడుగురు ఎంపీలు పార్లమెంట్ను బహిష్కరించారు.
ఇవాళ నల్లచొక్కాలు ధరించిన ఎంపీలు.. పార్లమెంట్ ముందు ఆందోళన చేశారు. ధాన్యం సేరణకు కేంద్రం సమగ్ర జాతీయ విధానం తేవాలని తాము కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రాజ్యసభ సభుడు కేశవరావు అన్నారు.
ప్రభుత్వం తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు చేసే అంతవరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని, పార్లమెంట్లో తమ మాటలు వినని ప్రభుత్వానికి తర్వలో బుద్ది చెపుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో హడావుడి చేసిన ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ సమావేవంలో మౌనంగా ఉంటున్నారని విమర్శించారు.