జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు బయలుదేరారు. కంకిపాడు మీదుగా కృష్ణా, గుంటూరు జిల్లాల పర్యటన మొదలవుతుంది. ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ మీదుగా భట్టిప్రోలు చావలి, తెనాలి వైపు ఈ పర్యటన సాగబోతున్న విషయం తెలిసిందే. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది.
రెండు కార్ల మధ్యలో బైక్ ఇరుక్కుంది. బైక్పై ఉన్న వ్యక్తి కాలు విరిగింది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పామర్రు మండల కనుమూరు దగ్గర చోటు చేసుకుంది.
కాగా, ఈ పర్యటన సందర్భంగా ఆయా జిల్లాల జనసేన నేతలతోనూ పవన్ కల్యాణ్ చర్చలు జరిపి, తమ పార్టీ బలోపేతంపై ఆయన వారికి సూచనలు చేస్తారు. పవన్ పర్యటన నేపథ్యంలో జనసేన నేతలు ఆయా ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Also Read
ఏపి అసెంబ్లీలో సీఎం జగన్ ప్లే చేసిన వీడియోకి పడీ పడీ…
తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?