ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది మహిళలు ఎదుర్కొనే సమస్యలలో నెలసరి సక్రమంగా రాకపోవడం. చాలామందికి నెలసరి సరైన సమయంలో నెలసరి రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా నెలసరి 28 రోజులకు ఒకసారి వస్తుంది. అయితే చాలా మందిలో నెలసరి సక్రమంగా రాకపోవటం నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పులు ఎదుర్కొంటారు.
ఈ విధమైనటువంటి సమస్య అధికంగా ఉన్న వారు ముందుగా ఎలాంటి పద్ధతులను పాటించకుండా వైద్యులను సంప్రదించి సరైన చికిత్సలను చేయించుకోవాలి.గర్భాశయంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా లేదా అనే విషయాలను వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. నెలసరి సక్రమంగా రాకపోవడంతో కొందరు నెలసరి సక్రమంగా రావడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలను చెబుతుంటారు.
Also read:చిరంజీవి లేటెస్ట్ లుక్ చూశారా.. ఎంత బాగుందో?
ఈ విధమైనటువంటి చిట్కాలలో సొంపు ఒకటి. నెలసరి సక్రమంగా రానివారు సొంపు తినటం,సొంపు ఆకులను గులికలుగా చేసి తీసుకోవటం వల్ల నెలసరి సక్రమంగా వస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. నెలసరి సమయంలో వచ్చే నొప్పిని కూడా సొంపు నివారిస్తుందని చెప్పవచ్చు. దీని కోసం ముందు రోజు రాత్రి రెండు టేబుల్ స్పూన్ల సొంపును గ్లాసు నీటిలో నానబెట్టాలి.మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని వడబోసి తాగడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గడమే కాకుండా నెలసరి సక్రమంగా వస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.