- Advertisement -
పాదాలకు తగినంత తేమ అందకపోతే పాదాలకు పగుళ్ళు ఏర్పడతాయి. మరి ఈ సమస్య నుండి బయట పడాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అవటమే.
ఒక అరటి పండు, అవకాడో బాగా చిదిమి కలిపి ఈ మిశ్రమాన్ని పాదాల పగుళ్ళపై రాసి పావు గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తే పాదాల పగుళ్ళు తగ్గుముఖం పడతాయి.
ఆలివ్ నూనెను పాదాలకు రాసి కొంత సేపు మర్దన చేసి ఒక అరగంట అయ్యిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
నిమ్మకాయలో సహజమైన ఆమ్ల గుణాలు ఉండుట వలన పగిలిన చర్మాన్ని మాములు స్థితికి తీసుకువస్తాయి. నాలుగు స్పూన్ల నిమ్మరసానికి, రెండు స్పూన్ల తేనే, ఒక స్పూన్ నువ్వుల నూనె కలిపి పాదాల పగుళ్ళకు రాస్తే పగుళ్ళు తగ్గుతాయి.