పెద్ద హీరోల సినిమాల విడుదల అంటే ఓ పండగలా ఉంటుంది. థియేటర్ల దగ్గర సందడి వాతావరణం ఉంటుంది. అభిమాన సంఘాల డ్యాన్స్లు చేస్తూ సంబురాలు చేసుకుంటారు. ఇక సినిమా హాల్ లోకి వెళ్లాక .. హీరో ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి హడావుడి ఉంటుంది. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్తో సినిమా థియేటర్లు ఓపెన్ కావడం లేదు. థియేటర్లు ఓపెన్ చేసుకొనేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పటికీ తెరుచుకోవడం లేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి.
తాము ఎంతో నష్టపోయామని.. కాబట్టి ప్రభుత్వం తమ విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని థియేటర్ యజమానులు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతం ఓటీటీల యుగం నడుస్తోంది. కరోనా లాక్డౌన్ కంటే ముందు థియేటర్లో రిలీజ్ అయిన కొద్ది రోజులకు సినిమాలు ఓటీటీలోకి వచ్చేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.. కొన్ని పెద్ద సినిమాలు సైతం నేరుగా థియేటర్లలో విడుదలవుతున్నాయి. ఇక థియేటర్లు తెరుస్తారు.. అందులోనే సినిమాలు చూడొచ్చు అని ఆశపడుతున్న ఫ్యాన్స్ నిర్మాతల నిర్ణయాలతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
తాజాగా సురేశ్ ప్రొడక్షన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నది. నారప్ప, విరాటపర్వం చిత్రాలను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. దీంతో అంతా షాక్ అయ్యారు.’ప్రస్తుతం థియేటర్లలో విడుదల సాధ్యం కావడం లేదు. మంచి రేట్ వచ్చిందని ఓటీటీలో విడుదల చేస్తున్నాం తప్పేంటి’ అంటూ సురేశ్ బాబు అంటున్నారు. వెంకీ మరో మూవీ దృశ్యం 2 కూడా ఓటీటీ లోనే విడుదల అవుతుందని అంటున్నారు. కాగా, థియేటర్ యజమానులకు.. చిత్ర నిర్మాతలకు మధ్య ఈ విషయంలో బేదాభిప్రాయాలు ఉన్నాయి.
నేరుగా ఓటీటీలో సినిమాలు విడుదల చేయొద్దంటూ థియేటర్ యజమానులు ఇప్పటికే డిమాండ్ చేశారు. అయినప్పటికీ సురేశ్ బాబు మాత్రం ఓటీటీలో సినిమాల విడుదల ప్రకటించారు. అయితే తెలుగులో ఇంతవరకు స్టార్ హీరో సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కాలేదు. ప్రస్తుతం వెంకటేశ్ నటించిన నారప్ప ఓటీటీలో విడుదల కావడంతో.. త్వరలోనే మరికొందరు స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీలో విడుదలయ్యే చాన్స్ ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. కానీ ఫ్యాన్స్ మాత్రం నిరాశలో ఉన్నారు.
Also Read
సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీకి ప్లస్సా.. మైనస్సా..!