- Advertisement -
రాజ్ కోట్ టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు దూకుడు ఆడిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మూడోరోజు తడబడ్డారు. ఓవర్ నైట్ స్కొరు 207 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల ధాటికి 319 పరుగులకే ఆలౌటయ్యింది. కుల్దీప్, జడేజాలు టాప్ ఆర్డర్ని కూల్చగా సిరాజ్ నాలుగు వికెట్లతో రాణించాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్లో టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. మూడో రోజు ఆటముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 196 రన్స్ కొట్టింది.దీంతో టీమిండియా ఆధిక్యం 322 పరుగులకు చేరింది.
ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విధ్వంసక సెంచరీతో ఫ్యాన్స్ను అలరించాడు. సిక్సర్ల మోత మోగిస్తూ టెస్టుల్లో మూడో సెంచరీ నమోదు చేశాడు. జైస్వాల్ 5 సిక్స్లతో 104 పరుగులు చేయగా శుభ్మన్ గిల్(65 నాటౌట్) గా నిలిచారు.