జోడు పదవుల వ్వవహారం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలికి చిక్కులు తెచ్చిపెట్టింది. క్రికెట్ సలహా మండలి (సీఏసీ) సభ్యుడిగా ఉంటూనే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు సలహాదారుగా పనిచేస్తున్నాడు దాదా. ఇటీ వలె ఈ వ్య అంశంతో దాదాపై ఓ ఫిర్యాదు అందింది.ఇప్పటికే దాదాకు నోటీసులు జారీ చేసిన అంబుడ్స్మన్.. తన ముందు నేరుగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
దీంతో గంగూలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీసీసీఐలో బీసీసీఐలో తాను నిర్వహిస్తోన్న కీలక పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ కలిసి త్రి సభ్య కమిటీగా ఉంది. ఈ కమిటీనె టీమిండియా కోచ్ను నిర్ణయిస్తుంది.ఇక నుంచి క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా గంగూలీ కొనసాగుతున్నారు.
శనివారం బీసీసీఐ అంబుడ్స్మన్ డీకే జైన్ ముందు హాజరుకానున్న దాదా.. రెండింట్లో ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితుల్లో గంగూలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది