యాంకర్ అనసూయ ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. బుల్లితెరపై హాట్ యాంకర్గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయ..ఒక వైపు టీవీ షోలు మరోవైపు వరుస సినిమాలను సమానంగా బాలన్స్ చేస్తోంది. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం భారీగా ఆఫర్లు వస్తున్నా అనసూయ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
తాజాగా అనసూయకి ఓ క్రేజీ ఆఫర్ వరించినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పవర్స్టార్ పవన్కళ్యాణ్ -క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓ అప్కమింగ్ ప్రాజెక్టులో అనసూయ ప్రత్యేకగీతంలో కనిపించనుందట. నిజానికి పవన్ కళ్యాణ్తో స్పెషల్ సాంగ్లో డ్యాన్స్ చేయడానికి అనసూయకు ఇంతకు ముందే అవకాశం వచ్చిందట.‘అత్తారింటికి దారేది’సినిమాలోని ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’పాటలో అనసూయను తీసుకోవాలని దర్శకుడు త్రివిక్రమ్ భావించారట. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల అనసూయ ఈ అవకాశాన్ని వదులుకున్నారని టాక్.
అయినప్పటికీ ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించే అవకాశాన్ని అందుకుట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, క్రిష్-పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న మూవీ పీరియడ్ డ్రామా. కోహినూర్ వజ్రం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఏఎం రత్నం దాదాపు 100 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
మెగా హీరోలతో బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. దర్శకుడు ఎవరో తెలుసా..?