ఎనర్జిటిక్ హీరో రామ్.. తాను హీరోగా నటించిన సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ హీరోకు వరుస సనిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. దీనికి తగినట్టుగానే ఆయన సినిమాలు సైతం విభిన్న వెరైటీ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. ఆయన ఎనర్జిటిక్ తగినట్టుగానే ఆయన సినిమాలు సైతం అలాగే ఉంటాయి.
ఇటీవల సంచలన దర్శకుడు పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ అంటూ టాలీవుడ్ను ఒక ఊపు ఊపాడు. ఆ సినిమా ఇచ్చిన ఎర్జిటివ్ విజయం తో ఈ సంక్రాంతికి రెడ్ మూవీతో వెండితెరపై మెరిసి ప్రేక్షకులను థ్రిల్ చేశారు. ఈ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సనిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి మరింత సమయం పట్టే అవకాశముంది.
దీంతో మరో డైరెక్టర్తో సినిమా చేయడానికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆయనే తమిళ ప్రముఖ దర్శకుడు, పందేంకోడి ఫేమ్ లింగుస్వామి. తాను సిద్ధం చేసుకున్న కథను స్టైల్ స్టార్ అల్లు అర్జున్తో తీయాలని లింగుస్వామి అనుకున్నారట. అయితే, అల్లు అర్జున్ వేరే ప్రాజెక్టుల్లో ప్రస్తుతం బిజీగా ఉండటంతో ఈ స్టోరీని రామ్తో తీయడానికి నిర్ణయించుకున్నారట. తాజగా స్టోరీ రామ్ కు వినిపించడంతో ఓకే చెప్పారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ సినిమా ఊరమాస్గా ఉండబోతుందని టాక్ .. !
రాజకీయాల్లోకి రంగమ్మత్త అనసూయ.. ఏ పార్టీయో తెలుసా?
రామ్ చరణ్ ఉపాసన మధ్య గోడవలు ! అందుకేనట !