ప్రపంచకప్లో భాగంగా సౌతాంప్టన్ వన్డేలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ విండీస్ను చిత్తుచిత్తుగా ఓడించింది.రెండు జట్ల మధ్య శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 8 వికెట్లతో సునాయాస విజయం సాధించింది. ఇక జో రూట్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 100 రన్స్ చేసి నాటౌట్గా నిలిచిన జో రూట్ ఈ టోర్నీలో రెండో సెంచరీ సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కరీబియన్ జట్టు బ్యాట్స్మెన్ పేలవ షాట్లతో వికెట్లు పారేసుకోవడంతో 44.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. నికోలస్ పూరన్ (78 బంతుల్లో 63; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్.
ఓపెనర్ క్రిస్ గేల్ (41 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్), హెట్మైర్ (48 బంతుల్లో 39; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆతిథ్య జట్టు పేసర్లు మార్క్ వుడ్ (3/18), జోఫ్రా ఆర్చర్ (3/30) కట్టుదిట్టంగా బంతులేయగా, రూట్ కీలక సమయంలో రెండు వికెట్లు తీశాడు.ఇక టోర్నీలో నాలుగు మ్యాచ్లు ఇడిన ఇంగ్లండ్ మూడింట విజయం సాధించిది. 6 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 44.4 ఓవర్లలో 212 పరుగులు చేసి ఆలౌటయింది. పూరన్ 63 పరుగులతో రాణించాడు. హెట్మెయిర్ 39, క్రిస్ గేల్ 36 పరుగులు చేసి పరవా లేదనిపించారు.ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ చెరో మూడు వికెట్లు తీయగా.. జో రూట్ ఇద్దరిని ఔట్ చేశాడు. ఇక ప్లంకెట్, వోక్స్కి తలో వికెట్ దక్కింది