ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాడన్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేశ్కు ఆయన పేరుచెబితేనే పూనకం వస్తూ ఉంటుంది. ఇక ఆడియో ఫంక్షన్లు, మూవీ రిలీజ్ ఫంక్షన్లు, యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇలా ఎక్కడ చూసినా పవన్ కల్యాణ్ భజన చేస్తూ ఉంటాడు. దీంతో ఆయనను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బండ్ల గణేశ్కు ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్లో ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉందంటే అందుకు కారణం పవన్ ఫ్యాన్సే.
ఇక రాజకీయాల్లోనూ యాక్టివ్గా ఉండే బండ్ల గణేశ్ అప్పుడప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేశ్.. రచ్చ రచ్చ చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా బండ్ల గణేశ్ ట్విట్టర్లో పెట్టిన ఓ పోస్టు సంచలనంగా మారింది. పవన్ కల్యాణ్, రానా హీరోలుగా.. అయ్యప్పనుమ్ కోషియమ్ అనే మలయాళ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ బీమ్లా నాయక్ అనే పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడు.ఇందుకు సంబంధించిన పిక్ను ట్విట్టర్లో షేర్ చేశాడు బండ్ల గణేశ్. దేవరవేట మొదలైంది అంటూ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Also Read
ప్రభాస్ -నాగ్ అశ్విన్ మూవీ షూటింగ్ షురూ.. !