Tuesday, April 30, 2024
- Advertisement -

‘అర‌వింద స‌మేత’లో హైలెట్ అదేన‌ట‌..!

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన అర‌వింద స‌మేత వ‌చ్చేవారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను చిన‌బాబు నిర్మించారు. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో సినిమా ప్రమోష‌న్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్‌.సినిమాపై ఇప్ప‌టికే ఇండస్ట్రీలో ఓ పాజిటివ్ బ‌జ్ ఏర్ప‌డింది.సినిమాలో సెకండ్ హాఫ్ చాలా హెవీగా ఉండబోతుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ ఉపన్యాసాలతో సెకండ్ హాఫ్ మొత్తం సాగుతుందని అంటున్నారు.సినిమా ఫస్ట్ హాఫ్ లోనే భారీ ఫైట్లను పెట్టిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో మాత్రం సీమ ఫ్యాక్షనిస్ట్ లను తన మాటలతో ఎన్టీఆర్ మార్చే క్రమంలో పెద్ద పెద్ద డైలాగులు చెబుతాడట.

ఈ డైలాగులన్నీ చాలా డెప్త్ గా ఉంటాయని తెలుస్తోంది.ఎన్టీఆర్ చెప్పే డైలాగులు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. సినిమాకు ఇంట‌ర్వెల్ హైలెట్ అవుతుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.మ‌రి సినిమా విడుద‌ల అయిన త‌రువాత ఇంకా ఎన్ని రికార్టులు సృష్టిస్తుందో చూడాలి.ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు హీరోయిన్లుగా న‌టించారు.ద‌స‌రాకు కానుక‌గా సినిమాను ఈ నెల 11న విడుద‌ల చేయ‌నున్నారు.ప్ర‌స్తుతం సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -