తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్కు ఉన్న ప్రత్యేక స్థానం చెప్పనక్కర్లేదు. మాస్ ఆడియన్స్ను అలరించే పెద్ద హీరోల సినిమాలనుంచి చిన్న హీరోల సినిమాల దాకా ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. అందుకే దీనిపై దర్శక, నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.
ప్రధానంగా ప్రత్యేక పాటలకు మంచి డిమాండ్ ఉండటంతోపాటు మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎక్కువగా ఐటమ్ గర్ల్స్ను ముంబై నుంచి రప్పిస్తుంటారు. గతంలో ముమైత్ ఖాన్, హంస నందిని, ఇప్పుడు సన్నీ లియోన్.. వీరంతా ముంబై నుంచి దిగుమతి అయిన వాళ్లే. తాజాగా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి మరో కొత్త డాన్సర్ ముంబై నుంచి వచ్చింది. ఆమె పేరు రాధికా పాటిల్. ‘శాంతాబాయి’ అనే మరాఠి సాంగ్తో రాధికా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈమె తెలుగు తెరపై చిందులేయనుంది.
నంది క్రియేషన్స్ బ్యానర్పై కేఎండీ రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలుగా ‘బంగారి బాలరాజు’ అనే చిత్రం తెరకెక్కుతోంది. కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని సారథి స్టూడియోస్లో స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుగుతోందన్నారు. ‘శాంతాబాయ్’ పాటతో యువతను తనవైపు తిప్పుకున్న లేటెస్ట్ హాట్ బాంబ్ రాధికా పాటిల్ను ‘బంగారి బాలరాజు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేస్తున్నామని చెప్పారు. గీతామాధురి పాడిన ఈ పాటకి రాధిక తన అద్భుతమైన నృత్యంతో చిత్రానికి మరింత గ్లామర్ తీసుకొచ్చిందని తెలిపారు.
పరువు, ప్రతిష్టల మధ్య సాగే సున్నితమైన ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుతోందని దర్శకుడు చెప్పారు. రాయలసీమలో జరిగిన ఓ యదార్థ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నామన్నారు. ఈనెల ఆఖరి వారంలో టీజర్ని విడుదల చేయబోతున్నామని చెప్పారు. అలాగే ఈ టీజర్తో హీరో, హీరోయిన్లను పరిచయం చేస్తామని చెప్పారు.
https://www.youtube.com/watch?v=lcxRxoK9ioo