ఇటీవల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు సైతం ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. థియేటర్లలో విడుదల చేస్తే కరోనా కారణంగా జనం వస్తారో రారో అన్న సందేహంతో ఓటీటీ వేదికలో విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. వెంకటేశ్ నటించిన నారప్ప చిత్రం.. అమెజాన్ ప్రైమ్లో విడుదలై హిట్ తెచ్చుకున్నది. ఈ క్రమంలో వెంకటేష్ నటిస్తున్న మరో చిత్రం దృశ్యం 2 కూడా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
ప్రస్తుతం ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి లేదు. దీంతో చాలా మంది పెద్ద నిర్మాతలు సైతం తమ సినిమాలను ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఓటీటీలో విడుదల చేయడం మినహా వేరే మార్గం లేదని ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు. మలయాళంలో మంచి సక్సెస్ సాధించిన దృశ్యం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయగా .. ఇక్కడ కూడా విజయం సాధించింది.
మలయాళంలో మోహన్ లాల్ మరోసారి దృశ్యం సీక్వెల్ తీయగా అది కూడా అక్కడ ఘన విజయం సాధించింది. దీంతో తెలుగులో దృశ్యం రీమేక్లో నటించిన వెంకటేష్ దృశ్యం 2 తెలుగులో రీమేక్ చేశారు. సీక్వెల్ లో కూడా వెంకటేశ్, మీనా జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్నది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 9 లేదా 10 తేదీల్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
Also Read
బన్నీ కోసం వచ్చేస్తున్న సన్నీ..!
త్రిష పెళ్లి ఫిక్స్..? వరుడు ఎవరంటే..?
Also Watch