ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి రోజు రోజు ఆదరన పెరిగిపోతోంది. దీన్ని చూసి తట్టుకోలేక టీడీపీ తన మీడియా ద్వారా జగన్ను దెబ్బకొట్టేందుకు కొత్త ఎత్తుగడలను అనుసరిస్తోంది. ఇటీవల కాలంలో ఏపీ విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద చిత్ర విచిత్రమైన వార్తల్ని వండేయటం కనిపిస్తోంది.
జరిగిన విషయాలకు సైతం కొత్త అర్థాల్ని వెతికి మరీ డ్యామేజింగ్ గా వార్తల్ని ఇవ్వటం ఈ మధ్యన అలవాటైంది.
అయితే ఇప్పుడు తాజాగా తన అనుకూల మీడియాద్వారా హీరో నాగార్జున వైసీపీలోకి వస్తున్నారని కథనం ప్రచురించింది.గతంలో కూడా మన్మథుడు పార్టీలోకి వస్తున్నారని వార్తలు వినిపిస్తున్నా నిజానికి…. అలాంటిదేమీ లేదన్న విషయాన్ని నాగ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి..నిజం లేని ఇలాంటి వార్తల్ని ఎందుకు తెర మీదకు తెస్తున్నట్లు అన్న దానికి ఆసక్తికరమైన వాదనను వినిపిస్తున్నారు.
లేనిపోని కథనాల ద్వారా జగన్ను దెబ్బతీసేందుకే అధికారపార్టీ తన పచ్చమీడియాద్వారా ప్రయత్నంచేసిందనే వాదన వినిపిస్తోంది.ప్రముఖులు విపక్షపార్టీలోకి వస్తున్నారని చెప్పటం…లేదని వారు ఖండించటంద్వారా…పార్టీలోకి రవాలనుకొన్నా రావడంలేదంటూ బురదజల్లే కార్యక్రమాన్ని ప్రారంభించిందంటున్నారు.
విపక్ష పార్టీలోకి రావాలన్న ఆసక్తి ఏ ప్రముఖుడు ప్రదర్శించటం లేదన్న భావన మనసుల్లో నాటే బృహత్తర ప్రణాళికలో భాగంగా ఇలాంటి వార్తలు అప్పుడప్పడు తెర మీదకు తెస్తున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ పార్టీని దెబ్బ తీసేందుకే ఈ తరహా ప్రయత్నాల్ని చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- సంచలన నిర్ణయం తీసుకున్న జగన్…. పాదయాత్ర మొదలు పెట్టనున్నఅధినేత
- జగన్లో మార్పు…. ప్రభుత్వంపై విమర్శలు చేసె జగన్ లౌక్యం ప్రదర్శించారు.
- ఒక లైక్.. ఒక షేర్ తో జగన్ సీఎం అవుతారా..?
- జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అమెరికా అమ్మాయి
{youtube}Bdr_O6H2qu4{/youtube}