తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) కేసులు గత 24 గంటల్లో కొత్తగా 15,823 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో 226 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,40,01,743కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 4,51,189కు పెరిగింది.
అలాగే నిన్న కరోనా నుంచి 22,844 మంది కోలుకున్నారు. మొత్తం కరోనా నుంచి కోలుకున్నారు సంఖ్య 3,33,42,901కు చేరింది. ఇక ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,07,653 మంది చికిత్స తీసుకుంటున్నారు.
ఇప్పటి వరకు దేశంలో మొత్తం 96,43,79,212 డోసుల వ్యాక్సిన్లను వినియోగించారు. నిన్న ఒక్క రోజే 1,33,18,718 డోసుల వ్యాక్సిన్లను వినియోగించారు. నిన్న 50,63,845 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. కేరళలో నిన్న 7,823 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆ రాష్ట్రంలో 106 మంది మృతి చెందారు.