ప్రపంచంలోనే తొలిసారిగా గొరిల్లాలకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. అమెరికాలో శాన్ డీగో జూలోని గొరిల్లాలు లక్షణాలేవీ లేకుండానే కరోనా బారిన పడ్డాయని అధికారులు తెలిపారు.తొలుత జూ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. వారంతా మాస్కులు పెట్టుకున్నప్పటికీ గొరిల్లాలు మహమ్మారి బారిన పడ్డాయని అధికారులు వివరించారు. గతంలో పులులకు కరోనా సోకిన ఘటనలున్నా.. గొరిల్లాలకు సోకడం మాత్రం ఇదే తొలిసారి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న గొరిల్లాలు కరోనా బారిన పడిన నేపథ్యంలో వన్యప్రాణి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గొరిల్లాలకు కరోనా నేపథ్యంలో.. ఈ జాతులపై మహమ్మారి ఎలా ప్రభావం చూపుతుందనే సమాచారం తెలుసుకొనేందుకు పరిశోధనలు దోహదం చేస్తాయని పార్క్ అధికారులు తెలిపారు. ‘వరల్డ్ వైల్డ్లైఫ్ ఫండ్’ ప్రకారం.. గత రెండు దశాబ్దాలలో వీటి సంఖ్య 60శాతానికి పైగా తగ్గింది.
బాబ్రీ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుకి సవాల్..!
భోగి మంటల్లో రైతు జీవోలు వేసిన చంద్ర బాబు..!
హనీమూన్ ప్లాన్ గురించి చెప్పిన సింగర్ సునిత!
56.5లక్షల టీకా డోసులు.. వెల్లడించిన హర్దీప్ సింగ్ పూరీ..!