కర్ణాటకలో కరోనా కేసులు విజృంభించడంతో యడియూరప్ప ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. కర్నాటకలో కోవిడ్ -19 కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బిఎస్ యడియూరప్ప ప్రభుత్వం మంగళవారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. రాబోయే 14 రోజులకు రేపు రాత్రి 9 గంటల నుండి రాష్ట్రంలో కోవిడ్ కర్ఫ్యూ అమలు చేయనున్నారు.
ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య అవసరమైన సేవలు అనుమతించబడతాయి. ఉదయం 10 గంటల తరువాత షాపులు మూతపడతాయి. అయితే అత్యవసర సేవలకు ఆటంకం ఉండదని.. నిర్మాణం, తయారీ, వ్యవసాయ రంగాలు మాత్రమే పనిచేయడానికి అనుమతించబడతాయి.
ఇక ప్రజా రవాణా మూసివేయబడాలని మీడియాతో అన్నారు. కరోనావైరస్ రాష్ట్రమంతటా వేగంగా వ్యాపిస్తున్నాయని కర్నాటక మంత్రి ఎంటిబి నాగరాజ్ వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో సిఎంకు కొన్ని సూచనలు ఇచ్చాము. సాధారణ ప్రజల ప్రాణాలతో పాటు విక్రేతలు, చిన్న వ్యాపారాలను కాపాడటం చాలా ముఖ్యం అని మంత్రి అన్నారు.
ఎన్నో కష్టాలు ఎదిరించిన గొప్ప నటుడు పొట్టి వీరయ్య : చిరంజీవి