- Advertisement -
సృష్టించిన బీభత్సానికి ప్రజలు వణికిపోతున్నారు. తుపాను దాటికి ఇప్పటి వరకు ఏడుగురు మృత్యవాత పడ్డారు. మరికొందరు గల్లంతయ్యారు. హుజియాన్, జెజియాంగ్ రాష్ట్రాలను మెరాండీ అతలాకుతలం చేసింది. హుజియాన్ రాష్ట్రంలో సమాచార, విద్యుత్, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి.
16 వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 23 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా 25 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లినట్టు అధికారుల అంచనా. మూడు లక్షల మందికిపైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. దేశంలోని చారిత్రక కట్టడాలు తుపాను దాటికి దెబ్బతిన్నాయి. గురువారం ఈ తుపాను తీరాన్ని తాకింది. దీంతో పెనుగాలులు, భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి.