పాకిస్థాన్ రైల్వే ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన 6 బిలియన్ డాలర్ల రుణానికి.. చైనా అదనపు హామీలు కోరినట్లు వస్తున్న వార్తలపై ఆ దేశం స్పందించింది. ఇరుదేశాల మధ్య నిర్మిస్తున్న సీపెక్(చైనా-పాక్ ఆర్థిక నడవా)కు బీజింగ్ సమకూరుస్తానన్న 60 బిలియన్ల డాలర్ల రుణాల వాగ్దానం సైతం నేరవేరుస్తామని స్పష్టం చేసింది. వీటికి వ్యతిరేకంగా వచ్చిన నివేదికలన్నీ అవాస్తమని చైనా విదేశాంగ ప్రతినిధి ఝావో లిజియాన్ తెలిపారు.
ఈ ఆర్థిక నడవా బలూచిస్థాన్, పాకిస్థాన్లోని గ్వదార్ పోర్ట్ నుంచి చైనాలోని గ్జింగ్జాంగ్ ప్రావిన్స్ వరకు నిర్మిస్తున్నారు. ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా వెళ్తున్నందున ఈ ప్రాజెక్టుకుపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా.. సీపెక్తో సహా రోడ్ అండ్ బెల్ట్ ఇన్షియేటివ్(బీఆర్ఐ)లకు నిధుల మంజూరులో జాప్యం జరిగింది. అంతేకానీ రుణాల విషయంలో వెనక్కి మాత్రం తగ్గదిలేదు. మొదటి మూడు త్రైమాసికాలలో బీఆర్ఐ దేశాలలో 30 శాతం నిధులను పెట్టుబడిగా పెట్టాము అని అన్నారు..