Friday, May 3, 2024
- Advertisement -

సీఎం కేసీఆర్ వ్యూహం ఫలించిందా ?

- Advertisement -

వరి కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోలు కొనసాగుతోందని బీజేపీ ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న మద్దతు ధర ప్రకారం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేంద్ర తెలిపింది. రైతులు అధైర్యపడొదని చివరి గింజవరకు కేంద్ర తీసుకుంటుందని చెప్పుకొచ్చింది.

సీఎం కేసీఆర్ వ్యూహం ఫలించిందా ? అంటే అవుననే అనిపిస్తోంది. ఢిల్లీకి వెళ్లకముందు సీఎం తాము వడ్లు కొంటున్నా కేంద్రం మాత్రం తీసుకోవడం లేదని.. కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ వారితో ఎం మాట్లాడో తెలియదు కానీ.. సీఎం ఢిల్లీ నుంచి వచ్చి సైలెంట్ అయ్యారు.

సీఎం కేసీఆర్‌తో పాటు బీజేపీ నేతలు సైతం మౌనం వహిస్తున్నారు. గతంలో కేసీఆర్‌ను జైలుకు పంపుతా, కేసీఆర్ తాటతీస్తా, కేసీఆర్‌ను రోడ్డుకు లాగుతా అని వ్యక్తితంగా విమర్శించిన బండి సంజయ్ ఇప్పుడు సైలంట్ అయ్యారు. సీఎం కేసీఆర్‌కు, బీజేపీ రాష్ట్ర అధక్షుడికి.. కేంద్ర పెద్దలు గట్టిగానే క్లాస్ పీకినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అందుకే వాళ్లు మౌనంగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ ఎక్కడ..? మౌనం ఎందుకు..?

చంద్రబాబును నడిపిస్తున్న పికే..?

భగ్గుమంటున్న కూరగాయల ధరలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -