Tuesday, April 30, 2024
- Advertisement -

చంద్రబాబును నడిపిస్తున్న పికే..?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఐతే వరదల వల్ల ఇళ్లు, పంట నష్టపోయిన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్‌ ద్వారా నిత్యవసర వస్తువులు సైతం అందజేశారు. కడప పర్యటన ముగించికున్న బాబు చిత్తూరులో ప్యటిస్తున్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్న బాబు.. వరద మానవ తప్పిదం వల్లే వచ్చిందని దీని బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదే అని విమర్శించారు. అనుభవం లేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదంతా భాగానే ఉన్నా రాష్ట్రంలో ఏదైన అనధికార కార్యక్రమం జరిగినా, ప్రభుత్వం వల్ల రైతులు మోసపోయినా ముందుండి మాట్లాడే వ్యక్తి ఇంతవరకు స్పందింలేదు. దీంతో రాజకీయ విశ్లేషకులకు పలు అనుమానాలు కలుగుతున్నాయి. భువనేశ్వరీ పై నీచంగా మాట్లాడిన తీరుపై జనసేన అధినేత ఇంతవరకు స్పందించలేదు.

రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఆడబిడ్డకూ తాను అండగా ఉంటానన్న పవన్ ఇప్పుడు ఈ ఘటనపై స్పందలేదు. దీంతో చంద్రబాబు చేత అసెంబ్లీని బైకాట్ చేయించి గతంలో జగన్ చేసిన విధంగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదియాలని పవన్ చంద్రబాబుకు సూచించనట్లు పలువురు అనుమానిస్తున్నారు. దీనికి ఏఉపాయం దొరకక చంద్రబాబుకు తన భార్య పేరు వాడుకోమ్మని పవన్ చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ పవన్ చదివేవాడని వైసీపీ వర్గాలు గతంలో విమర్శలు చేయగా.. తాజాగా పవన్ రాసిన స్క్రిప్ట్‌ను చంద్రబాబు చదువుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ పై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

కేంద్రం అందుకే దిగొస్తుందా?

చంద్రబాబు ఊరూ వాడా దండోరా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -