ఆస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిక భారీ ఊరట లభించింది. ఈ కేసులో హైకోర్టలు సంచలన నిర్ణయం వెల్లడించింది. ఆస్తుల కేసులో ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్కు ఊరట లభించింది. వైఎస్ జగన్ ఆస్తుల కేసులో ఆదిత్యనాథ్ దాస్ను విచారించేందుకు సీబీఐకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదు. దీంతో విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించకపోవడంతో ఆదిత్యానాథ్ దాస్పై మోపిన అభియోగాలను కొట్టివేసింది హైకోర్టు.
2004-2009 మధ్య కాలంలో ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ వైఎస్ జగన్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ అభియోగాలు మోపింది. ముఖ్యంగా ఇండియా సిమెంట్ కు అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ అభియోగాలు మోపింది. ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులు జగన్ ఆస్తుల కేసులో ఊరట పొందారు. తాజాగా ఆదిత్యనాథ్ ఆరోపణలను హై కోర్టు కొట్టివేసింది. ఇది జటన్కు కూడా భారీ ఊరట లభించినట్లే.