దేశంలో ఇప్పటికే రెండో దశ కరోనాతో వణికిపోతున్న భారత్లో మూడో వేవ్ కూడా తప్పదని కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణుల బృందం వెల్లడించింది. దేశంలో కరోనాతో ప్రతిరోజు నాలుగు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరికొన్ని చోట్ల రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నారు.
తాజాగా హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ చైన్ను తెగ్గొట్టేందుకు పది రోజులపాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. రేపటి నుంచి 16వ తేదీ వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షలు ఇప్పటికే రద్దు చేయడంతో ఈ నెల 31 వరకు విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించింది.
మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులను 50 శాతం మాత్రమే నడపనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను పూర్తిగా మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది.
ఇంత కష్టం ఎవరికీ రావొద్దు : జగపతిబాబు