కరోనా ఎఫెక్ట్తో ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారు. లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ థియేటర్లు మాత్రం ఓపెన్ కావడం లేదు. ఇప్పటికే థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా నష్టోపోయాయి. దీంతో ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా.. థియేటర్లు ఓపెన్ చేసేందుకు యజమానులు ముందుకు రావడం లేదు. అయితే తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాక.. థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకొనేందుకు కూడా అవకాశం కల్పించింది.
అయితే థియేటర్ల యజమానులు మాత్రం.. విద్యుత్ బకాయిలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకొనేందుకు అనుమతి ఇచ్చారు. జీవో నంబర్ 35 విడుదల చేసి.. టికెట్ల ధరల విషయంలో ఆంక్షలు విధించారు. దీంతో థియేటర్ల యజమానులు అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలతో సీ సెంటర్ థియేటర్లు నడపడం చాలా కష్టమని వారు అంటున్నారు. ఏపీ, తెలంగాణలోని థియేటర్లు ఓపెన్ కాబోతున్నాయి. జూలై 30 నుంచి థియేటర్లు తెరుచుకోబోతున్నాయి.
ఇదిలా ఉంటే టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శరణ్ కొపిశెట్టి తెరకెక్కిస్తున్న సినిమా తిమ్మరుసు థియేటర్లో విడుదల కాబోతున్నది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాచురల్ స్టార్ నానీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ’ మనదేశంలో ప్రజలకు ఎంటర్టైన్మెంట్ సినిమాలే. అటువంటి సినిమాలపై ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగితే ఎవరూ పట్టించుకోరు. కానీ టికెట్ ధరలను నియంత్రించాలని ఎందుకు చూస్తున్నారు.సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి.’ అంటూ ఆయన ఫైర్ అయ్యారు.
Also Read
నేను సుమతో విడిపోలేదు.. కొంతకాలం విడిగా ఉన్నా.. కారణం ఏమిటంటే?