సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కె.రోజా దీపావళిని తన ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపావళి గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పారు. ‘‘నాకు భక్తి ఎక్కువ. దేవుడన్నా.. పండుగలన్నా చాలా ఇష్టం. మా పిల్లలకు దీపావళి అంటే చాలా ఇష్టం.
ప్రతి సంవత్సరం మా అన్నయ్య పిల్లలు కూడా మా ఇంటికే వస్తారు. ఈసారి కూడా వచ్చారు. అందరం కలిసి మా ఇంట్లోనే దీపావళి జరుపుకుంటాం. నేను ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ పండుగ అంటే కొత్త బట్టలు.. టపాసులు.. మిఠాయిలు.. సినిమాలు అన్నీ ఉండాల్సిందే.
ఈ రోజు పిల్లలతో కలిసి ‘ఇజం’ సినిమాకు వెళ్లాం. ప్రతి దీపావళీ నాకు ఎన్నో మంచి అనుభూతుల్ని వదిలి వెళ్తుంటుంది. ఒకప్పుడు ‘పెద్దన్నయ్య’ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుండగా.. నేను.. బాలకృష్ణగారితో పాటు యూనిట్ సభ్యులందరం కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నాం. ఆ దీపావళి నాకు ఎక్కువ ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుంది. నేను దేవుణ్ని కోరుకునేది ఒక్కటే.. నాతో పాటు అందరూ బాగుండాలి. నావల్ల పదిమందికి మంచి జరగాలి’’ అని రోజా చెప్పింది.
{youtube}p6LULArRJXs{/youtube}
Related